కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనెపల్లి మండలం డబ్బా గ్రామంలో నిన్న రాత్రి సమయంలో ఆదివాసీ వివాహితపై డబ్బా గ్రామ సర్పంచ్ కుమారుడు అబ్దుల్ రషీద్ దొంగచాటున అమే ఉంటున్న ఇంటికి చొరబడి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఇది గమనించిన స్ధానిక గ్రామస్తులు పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను పారిపోతు ఉండగా వెంబడించి మరి అతన్ని పట్టగా అతను నాకేం సంబధం లేదు వట్టిగా వచ్చాను అంటూ వారితో వాగ్వాదానికి దిగగా ఆ గిరిజనేతరుడు ఆదివాసీ జాతిని కించపరిచే విధంగా తీవ్రంగా దూషించాడు. ఇది ఆదివాసీ గ్రామస్తులు సహించలేక చితకబాది దేహాశుద్ధి చేసి కట్టి వేశారు, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసు వారు చాకచక్యంగా వ్యవహరించి ఆ ఆదివాసీ కోయ వివాహితను మాయా అమే పుట్టింటికి మరియు అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తినీ తీసుకెళ్లారు.
ఈ సమాచారం తెలుసుకున్న తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కోట్నక విజయ్ కుమార్ మాట్లాడుతూ అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు, ఇంత వరకు కూడ కెసు నమోదు చేయకుండ అతన్ని అన్యాయంగా కాపాడటానికి అయితే తుడుందేబ్బ ఆధ్వర్యంలో పరిస్థితులు వేరే విదంగా ఉంటాయని హెచ్చరించారు, ఆదివాసీ సమాజాన్ని తీవ్రంగా దూషించిన వ్యక్తిని వదిలేసేదు లేదు ఆని ఇంత అవమానం చేసినా వ్యక్తిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు