28.7 C
Hyderabad
April 20, 2024 05: 56 AM
Slider ప్రత్యేకం

ఘోరం: మూడోతరగతి బాలికపై అత్యాచార యత్నం

#akiveedupolice

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రైల్వే  స్టేషన్ రోడ్డు లో నివసిస్తున్న ఒక మహిళ కుమార్తె 3వ తరగతి చదువుతోంది. తల్లి వేరే పని మీద ఊరు వెళ్లడంతో బాలికపై రైల్వే స్టేషన్  సమీపాన నివసిస్తున్న తోపుడుబండ్లపై జొన్న పొత్తులు అమ్మే  ఇద్దరు యువకులు వలవేశారు. బాలికను జడ్ పి  హై స్కూల్ ఎదురుగా ఉన్న  ఖాళీ స్థలం నుంచి  మార్కెట్ యార్డులోకి గోడ దూకించారు.

అమ్మాయికి చాక్లెట్లు కొనుక్కునేందుకు  డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. మార్కెట్ యార్డ్ లో పురాతన దిశకు చేరిన  భవంతిలోకి తీసుకువెళ్లి  ఒంటి మీద బట్టలు విప్పేశారు. అత్యాచారయత్నం చేసేలోపు  ఇదంతా గమనిస్తున్న మరో ఇద్దరు యువకులు  విషయాన్ని ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అనంతరం విషయాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డు సిబ్బందికి  సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఉపాధ్యాయులు, మార్కెట్ యార్డు సిబ్బంది,  బాలిక బంధువులు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Related posts

ఫైనల్ జస్టిస్: నిర్భయ దోషులకు రేపు ఉరి ఖరారు

Satyam NEWS

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు

Satyam NEWS

పంజాబ్‌లో వేడెక్కిన రాజ‌కీయం… దూకుడు పెంచిన సిద్దూ

Sub Editor

Leave a Comment