ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే ఇంటి వద్దకే ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
నగరంలోని ఎన్జీవో కాలనీలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జెసి సాయికాంత్ వర్మ వచ్చారు.
అయితే పథకం ప్రారంభంలోనే మిషన్లు మొరాయించాయి. దాంతో కొద్ది సేపు వేచి ఉన్న జెసి వెనుదిరిగి వెళ్లిపోయారు.