36.2 C
Hyderabad
April 23, 2024 21: 53 PM
Slider విజయనగరం

విజయనగరంలో సేవా భారతి అధ్వర్యంలో రేషన్ కిట్ల పంపిణీ

#seva bharati

ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన సేవా భారతి క‌రోనా స‌మ‌యంలో నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంఫిణీ కి శ్రీకారం చుట్టింది. స‌మాజంలో  అన్ని వ‌ర్గాల వారు ఈ క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో ఇబ్బందులు ప‌డ‌టాన్ని గుర్తించిన‌ సేవా భార‌తి కార్య‌క‌ర్త‌లు…వారికి ఆదుకోవాల‌నే కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టింది.

ఇందులో భాగంగా సేవా ఇంటర్నేషనల్ సహకారంతో విజ‌య‌న‌గ‌రంలోని మ‌హారాణి పేట‌ విజ్ఙాన భార‌తి హైస్కూల్ లో  నిత్యావసర సరుకులు పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. అన్ని వ‌ర్గాల వారిని స‌మైక్య ప‌రిచి వారంద‌రికీ జిల్లా రెవిన్యూ అధికారి గ‌ణ‌ప‌తిరావు చేతులు మీదుగా నిత్యావ‌స‌ర స‌రుకుల పంపిణీ చేప‌ట్టారు….సేవాభార‌తి కార్య‌క‌ర్త‌లు.

ఈ  సందర్భంగా డీఆర్ఓ గ‌ణ‌ప‌తి రావు మాట్లాడుతూ.. ఎలాంటి పలా పేక్ష  ఆశించ‌కండా సేవ భార‌తి ముందుకు వెళుతోంద‌న్నారు. స‌మాజ‌మే ఓ దేవాల‌య‌మ‌ని…అందులో మ‌నమంతా ప్ర‌మిద‌ల‌మ‌ని..అందులో జ్యోతిలా ప్ర‌కాశించి  వెలుగును నింపాల‌న్నారు.  ప్ర‌తీ ఒక్క‌రిలో ఇలాంటి  ఆలోచ‌న‌లు రావాల‌ని సేవాభావం  అంద‌రిలో అల‌వ‌డాల‌ని  పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సేవాభార‌తి జిల్లా అధ్య‌క్షులు రిటైర్డ్ ఎంఆర్ఓ ర‌మ‌ణ మూర్తి మాట్లాడుతూ…దేశ వ్యాప్తంగా  ల‌క్షా 75 వేల గ్రామాలలో సేవాభార‌తి ఈ త‌ర‌|హా  కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌న్నారు. జిల్లాలో 18 మంది  లబ్ది దారులకు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేసామ‌న్నారు.

మైదాన ప్రాంతాల‌లో  500 మందికి  ఏజ‌న్సీలో 200 మంద‌కి పంపిణీ చేసామ‌న్నారు. ఈ కార్యక్రమంలో  ప్రముఖ ఆడిటర్,బిల్డర్ బాలాజీ, కొండా రెడ్డి.లోవారెడ్డి,ఉమాశంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.అనంత‌రం  సాలూరు, గుమ్మలక్మి పురం, సీతం పేట ఏజెన్సీ  ప్రాంతాల‌తోపాటు న‌గ‌ర మురికివాడ‌ల‌లో కూడా నిత్యావ‌స‌ర సరుకులను పంపిణీ చేసారు.

Related posts

అంబేద్కర్ విగ్రహ పునర్ ప్రతిష్టకు కొల్లాపూర్ లో కమిటీ

Satyam NEWS

అక్రమ కేసులు సహించం

Bhavani

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాలి

Bhavani

Leave a Comment