కడప జిల్లా సిద్దవటం మండలంభాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సిద్దవటం పోలీసులు వాహనాల తనిఖీలల్లో మంగళవారం అక్రమ రేషన్ బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు సిద్దవటం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో రాజంపేట డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి సమాచారం వెల్లడించారు.
సిద్ద వటం ఎస్సై మధుసూదన్ రెడ్డి సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ కడప నుంచి చెన్నయ్ వెళుతున్న ap 04 tt 5355 అనే లారీలో తనిఖీల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న డ్రైవర్ ఖాదర్ అరెస్ట్ చేశారు.
అతని వద్ద నుంచి సిద్దవటం పోలీసులు సుమారు 500 రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం చేసు కున్నారు. వారితో పాటు లారీ ఓనర్ అనిల్ కుమార్,బ్రోకర్ వెంకటేష్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.