సీబీఐ అధికారులమంటూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బెదిరించిన కేసులో సూత్రధారులుగా మలయాళం నటి లీనా మరియా పాల్ (మద్రాస్ కేఫ్ ఫేమ్), ఆమె భర్త సుఖేష్ చంద్రశేఖర్లను సీబీఐ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్కు చెందిన మణివర్ధన్రెడ్డి, తమిళనాడులోని మదురైకి చెందిన సెల్వ రామరాజ్లను సీబీఐ అరెస్టు చేసింది.
ఈ ముఠా దేశంలో ఇంకా చాలామందిని ఇలాగే మోసం చేసి ఆర్జించిన డబ్బును విదేశాలకు తరలించి ఉంటారన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. లీనా మరియా పాల్, చంద్రశేఖర్ లు ఇప్పటికే చాలా కేసుల్లో ఉన్నారు. మనీ సర్క్యులేటింగ్ స్కీం నడుపుతూ చెన్నైలో వారిద్దరు పట్టుబడ్డారు.
సీబీఐ పేరుతో తనను బెదిరిస్తున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో రాయపాటి సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ వీరిని గుర్తించింది. లీనా రెడ్ చిల్లీస్ అనే చిత్రంలో కూడా నటించింది. చిత్రాలలో నటిస్తూనే ఇలాంటి ఫ్రాడ్ లకు అలవటు పడ్డ లీనా, చంద్రశేఖర్ లు దేశంలో జరిగిన పలు నేరాలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.