ప్రతి విషయం లో కమ్మ , కమ్మ అంటు గోల చేసిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చి కేవలం రెడ్డి కులం వారికే పోస్టింగ్స్ ఇస్తున్నారని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. కమ్మ వాడు అని తెలిస్తే తీసి పక్కన పడేస్తున్నారని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు.
కమ్మ వారు ఏం చేస్తారులే అనుకోవద్దు. కమ్మ వారు తలుచుకుంటే లేచిపోతారని ఆయన హెచ్చరించారు. జగన్ పరిపాలన గుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా ఉందని, జగన్ కనీసం మంత్రులకు కూడా అందుబాటులో ఉండటం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను మార్చడం మంచిది కాదని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయకపోతే వేల మంది చనిపోయేవారని రాయపాటి అన్నారు.
కరోనా ను సీఎం జగన్ చాలా ఈజీగా తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వైసిపి ఎమ్మెల్యే ముస్తఫా నే క్వారంటైన్ లో ఉన్నాడు ఆ విషయం తెలుసుకోవాలి అని రాయపాటి తెలిపారు.