ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ మెట్రో రైలు స్టేషను సమీపంలోనీ ఆర్. సి. ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ రజిత పరమేశ్వర్రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పేద ప్రజలకు
నాణ్యమైన వైద్య సేవలను అందించాలని నిర్వాహకులు డాక్టర్ ప్రీతం రెడ్డి కి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రీతం రెడ్డి వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జి.శ్రీనివాసరావు, సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి