36.2 C
Hyderabad
April 25, 2024 22: 49 PM
Slider నిజామాబాద్

కరోనా కరోనా: వలస బతుకులకు తప్పని తిప్పలు

villages 281

అసలే పేద కుటుంబాలు ఆపై బతుకుదెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తారు. అందులో భాగంగానే వారు కొన్నేళ్ల క్రితం మద్నూర్ మండలంలోని కొడిచిర గ్రామానికి చెందిన  కుటుంబాలు కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలకి వలస వెళ్ళారు. కరోనా మహమ్మారి పుణ్యమా పనులు బంద్ అయ్యాయి. యజమాని పొమ్మన్నాడు.

దీంతో చేసేదేమీ లేకపోతున్నది. తమ సొంత ఊరుకు వెళ్లాలంటే  రవాణా వ్యవస్థ లేదు. దేవుడా నువ్వే దిక్కు అంటూ నడుచుకుంటూ బిచ్కుంద  పట్టణానికి చేరుకున్నారు. నడచుకుంటూ రావడానికి మూడు రోజులు పట్టిందన్నారు. వీరిలో యువకులతో పాటు మహిళలు చిన్నపిల్లలు కూడా ఉండడం విశేషం. వీరి గ్రామానికి చేరడానికి మరో రోజు అవుతుందని ఇక్కడి వరకూ రావడానికి చాలా అవస్థలు ఎదుర్కొన్నామని వారు తమ ఆవేదనను సత్యం న్యూస్ తో పంచుకున్నారు.

Related posts

కౌండిన్య గౌడ యువజన సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

సైబర్ నేరాల నిరోధానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లు

Satyam NEWS

అపర కర్మ భవనoకు శంకుస్థాపన

Murali Krishna

Leave a Comment