అసలే పేద కుటుంబాలు ఆపై బతుకుదెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తారు. అందులో భాగంగానే వారు కొన్నేళ్ల క్రితం మద్నూర్ మండలంలోని కొడిచిర గ్రామానికి చెందిన కుటుంబాలు కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలకి వలస వెళ్ళారు. కరోనా మహమ్మారి పుణ్యమా పనులు బంద్ అయ్యాయి. యజమాని పొమ్మన్నాడు.
దీంతో చేసేదేమీ లేకపోతున్నది. తమ సొంత ఊరుకు వెళ్లాలంటే రవాణా వ్యవస్థ లేదు. దేవుడా నువ్వే దిక్కు అంటూ నడుచుకుంటూ బిచ్కుంద పట్టణానికి చేరుకున్నారు. నడచుకుంటూ రావడానికి మూడు రోజులు పట్టిందన్నారు. వీరిలో యువకులతో పాటు మహిళలు చిన్నపిల్లలు కూడా ఉండడం విశేషం. వీరి గ్రామానికి చేరడానికి మరో రోజు అవుతుందని ఇక్కడి వరకూ రావడానికి చాలా అవస్థలు ఎదుర్కొన్నామని వారు తమ ఆవేదనను సత్యం న్యూస్ తో పంచుకున్నారు.