సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం రెబల్లె గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర, శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ శారద చంద్రమౌళీశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాల స్థాయి ఎద్దుల బండ పందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హుజూర్ నగర్ శాసనసభ సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొని పందాలను ప్రారంభించారు.
అనంతరం ఆయన స్వామి, అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు సైదిరెడ్డిని శాలువాతో సత్కరించి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.