ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్ కు చెందిన గొనెపాటి విష్ణు ప్రసాద్ (58) ఈరోజు కరోనా మృతి చెందారు. ఆయన భార్య నర్సా రత్నం గత సంవత్సరమే చనిపోయారు.
వారికి ఒకే కుమారుడు కైలాష్. తల్లి తండ్రి మరణించడంతో అతను అనాధ అయ్యాడు. 40 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుండి వలస వచ్చి ఆదిలాబాద్ లో బట్టలు కుట్టు కుంటూ జీవనం కొనసాగిస్తూ వారు బతుకుతున్నారు.
తల్లిదండ్రులు లేక పోవడంతో అనాధ అయిన అతడిని చూడలేక కన్నీరు మున్నీరు అయ్యారు. మాములు పరిస్థితిలో చనిపోతే ఎవరైనా వచ్చేవారేమో కాని ప్రస్తుతం ఉన్నది కరోనా పరిస్థితి. దగ్గర వాళ్లు కూడా రాలేని దారుణపరిస్థితి.
సమాచారo తెల్సుకున్న యువజన సంఘాల, రెడ్ క్రాస్ బాధ్యులు బాల శంకర్ కృష్ణ విష్ణుప్రసాద్ అంత్యక్రియలకు ముందుకు వచ్చారు.
యువజన సంఘాల సమితి, రెడ్ క్రాస్ వారు ముందు కొచ్చి అంత్యక్రియలు నిర్వహించి వారి ఉదారతను చాటున్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ, రెడ్ క్రాస్ యువజన సంఘాల ప్రతినిధులు శశి కల చౌహాన్, పసుపుల రాజు, అఖిల్ రెడ్డి మోచి సంఘం ప్రతినిధులు కావల్ల అంజి, శేఖర్, పారిశుద్ధ, కార్మికులు కాలనీ వాసులు అలాగే బాలల సంరక్షణ అధికారి, రాజేంద్రప్రసాద్, సభ్యులు సామీరులకన్ జిల్లా బాధ్యులు విష్ణు ప్రసాద్ కుమారుడి బాధ్యత తీసుకుంటామని అన్ని తామే చూసుకుంటాను భరోసా ఇచ్చారు.