36.2 C
Hyderabad
April 24, 2024 21: 26 PM
Slider కడప

కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం డంప్ స్వాధీనం…

Red sandars

కడప జిల్లా పుల్లంపేట మండలంలో అటవీశాఖ ,పోలీస్ సిబ్బంది కుంబింగ్ నిర్వహించి బుధవారం భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.ఎన్ బోటిమిదపల్లి వద్ద నున్న అడవిలో గాలేరు-నగరి సమీపంలో భారీ డంప్ ఉన్నట్టు గుర్తించారు.

పట్టుబడ్డ దుంగల విలువ దాదాపు మూడు కోట్ల ఉంటుందని అంచనా.అటవీశాఖ అధికారులు కంటైనర్ తో పాటూ 129 కి ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని రైల్వే కోడూరు అటవీ శాఖ కార్యాలయంకు తరలించారు.

పోలీస్ అధికారులు వేరుగా దాడులు చేసి 27 దుంగలు స్వాధీనం చేసుకొని పుల్లంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ కుంబింగ్ లో పుల్లంపేట, ఓబులవారిపల్లె పోలీస్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.అటవీ ప్రాంతంలో కుంబింగ్ ఇంకా కొనసాగుతోంది.పారారీ అయ్యిన 30 మంది పైగా కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

విజయవాడలో కాలభైరవస్వామి విగ్రహ ప్రతిష్ట

Satyam NEWS

ల్యాండ్ మాఫియా అడ్డా నరేంద్రనగర్ కాలనీ

Sub Editor

తెలంగాణ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment