27.7 C
Hyderabad
April 25, 2024 09: 23 AM
Slider సినిమా

ప్రభాస్ సినిమాకు జగన్ ప్రభుత్వం వెసులుబాటు

#radheshyam

ప్ర‌భాస్ – పూజా హెగ్దే న‌టించిన చిత్రం ‘రాధేశ్యామ్’ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లవుతున్న సంగ‌తి తెలిసిన‌దే. ఈ సంద‌ర్భంగా ఎపి ప్ర‌భుత్వం చిత్ర నిర్మాణ సంస్థ‌కు టికెట్ ధ‌ర విష‌యంలో వెసులుబాటు క‌ల్పించింది. ఈ సినిమా ప్రీమియం టికెట్ ధ‌ర‌పై రూ. 25 అద‌నంగా పెంచేందుకు అవ‌కాశం క‌ల్పించింది. రాధేశ్యామ్ చిత్రం బ‌డ్జెట్ రూ. 170 కోట్లు కాగా.. దీనికి సంబంధించిన జిఎస్టి, ఇత‌ర బిల్స్‌ను నిర్మాణ సంస్థ ఎపి ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే అందించింది. న‌టులు, ద‌ర్శ‌కుడు తీసుకొనే రెమ్మున‌రేష‌న్‌తో సంబంధం లేకుండా సినిమా నిర్మాణానికి రూ. 100 కోట్ల‌కు పైగా వెచ్చిస్తే టికెట్ ధ‌ర పెంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తామ‌ని ఇటీవ‌ల సిఎం జ‌గ‌న్ వెల్ల‌డించిన విషయం తెలిసిన‌దే.

Related posts

NEW How To Lower Blood Pressure Without Taking Medicine Instant Remedy For Bp High Teva 928 Pills Blood Pressure

Bhavani

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

Satyam NEWS

లోన్ అప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment