మనీష్ సిసోడియా రిమాండ్ను రూస్ అవెన్యూ కోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. ఆ తర్వాత మార్చి 22 వరకు సిసోడియా జైలులోనే ఉంటారు. ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్పై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు మనీష్ సిసోడియాను కోర్టులో హాజరుపరిచింది. సిసోడియా కస్టడీ నేటితో ముగియనుంది. దాంతో సిసోడియాను మరో ఏడు రోజుల రిమాండ్ను ఇవ్వాలని ఇడి కోర్టులో కోరింది. సిసోడియాను రిమాండ్ కు ఇవ్వకపోతే, ఇప్పటివరకు చేసిన దర్యాప్తు ఫలించదని పేర్కొంది. సిసోడియా తరపు న్యాయవాది వాదిస్తూ.. విచారణ పేరుతో ఏజెన్సీ ఆయనను ఊరికే ఉంచుతోందని, ఏడు రోజుల్లో కేవలం 11 గంటలు మాత్రమే విచారణ జరిగిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇప్పటికిప్పుడు కస్టడీకి తీసుకోకుంటే పడిన శ్రమ వృథా అవుతుందని ఈడీ కోర్టుకు తెలిపింది. సీసీటీవీ నిఘాలో సిసోడియాను విచారిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. చివరకు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం వెలువరించారు.
previous post