ప్రస్తుత కరోనా మహమ్మారి విపత్కర సమయములో ప్రజలను భయందోళనలకు గురిచేసే విధంగా వదంతులు, అపోహలు సృష్టిస్తూ, నిరాధారమైన వార్తలను గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడానికి కుట్ర పన్నిన అభియోగంపై ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ ఆనంచిన్ని వెంకటేశ్వర్ రావును అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
సమాజంలో వైషమ్యాలను సృష్టిస్తూ ప్రజా ఆరోగ్య వ్యవస్థను దెబ్బ తీసే విధంగా విద్వేషపూరిత తప్పుడు వార్తలను ఆయన ప్రచురించారని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో సైబరాబాద్ కమీషనరేటు పరిధిలోని మైలరుదేవుపల్లి పోలీసు స్టేషను లో నమోదైన క్రిమినల్ కేసులో ఆనంచిన్ని వెంకటేశ్వర్ రావును అరెస్టు చేసి రేమండ్ కి పంపినట్లు పోలీసులు తెలిపారు.