కడప జిల్లా గోపవరం మండలం ఈనాడు విలేకరి షరీఫ్ గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటలకు మృతి చెందారు. ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు నిన్న రాత్రి బద్వేలులో ఉన్న ఆసుపత్రులు అన్నీ తిరిగారు. కరోనా నేపథ్యంలో వైద్యం చేయడానికి కానీ ఏ ఒక్క డాక్టర్ స్పందించ లేదు.
కనీసం ఏదో ఒక్కరంటే ఒక్క డాక్టర్ అయినా సూచనలు సలహాలు ఇచ్చి ఉంటే మిత్రుడు బ్రతికేవాడేమోనని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల జిల్లాలో పలువురు విలేఖరులు వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందడంపై రాజంపేట కలం గళం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.