కరీంనగర్ జిల్లా రామడుగు మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను పురస్కరించుకుని పార్టీ అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెన రాజ మల్లయ్య, పంజాల శ్రీనివాస్ గౌడ్, సిరికొండ రాజు, కర్ణ శీను, సత్యం, లక్ష్మణ్, వీరయ్య, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వజి అజయ్ నాని తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా రామడుగు జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ భారతి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంజాల ప్రమీల జగన్ మోహన్ గౌడ్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ శారద పుర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా రామడుగు మండలం భవన కార్మికుల అధ్యక్షుడు జవ్వజి భూమయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార తోట శంకరయ్య జవ్వజి గౌరయ్య శేఖర్ ఆశాలు జవ్వజి అజయ్ బన్నీ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.