శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఇది దేశవ్యాప్తముగా అందరూ జరుపుకొనే జాతీయ పండగ అని తెలిపారు.
బ్రిటిష్ వారు వెళ్లిపోయాక మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సి వచ్చింది. రాజ్యాంగం రూపొందించుకునిఅమలు మొదలు పెట్టిన రోజే ఇదని ఆయన అన్నారు.
1950 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నానమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జెండర్ ప్రాబ్లెమ్ : ఆడంగి వెధవల్లా వెనక దాక్కుంటున్నారా?