విజయనగరం జిల్లా ఆర్మర్డ్ రిజర్వు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్పీ రాజకుమారీ జాతీయ పతాకాన్ని ఎగర వేసారు.
తొమ్మిది గంటలకు పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. అనంతరం పరేడ్ కమాండెంట్ ఆధ్వర్యంలో జరిగిన కవాతును కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు.
జిల్లా పలు శాఖలలో ఉత్తమ ఉద్యోగస్తులుగా ఎంపికైన పలువురికి కలెక్టర్ బహుమతులు అందజేసారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ రాజు,ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ,ఎస్ బీ సీఐ రాంబాబు,
నగర సీఐలు మురళీ ,శ్రీనివాసరావు,ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు, ఎస్ఐలు కిరణ్, దేవీ,ప్రసాద్ ,పీఆర్ ఓ కోటేశ్వరరావు ఆర్మర్డ్ సిబ్బంది పాల్గొన్నారు.