ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కాచిగూడ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నింబోలి అడ్డ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు జి. కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి, జోగులాంబ గద్వాల్ జిల్లా ఇన్ఛార్జ్ బి.వెంకట్ రెడ్డి విచ్చేసి వివిధ ఆకారాలలో వేసిన ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులను అందజేసినారు. ఈ కార్యక్రమంలో బీ. సంతోష్ కుమార్, సుభాష్ పటేల్, మల్లికార్జున్, బల్ వీర్, ఎం.నర్సింగ్ రావు, రమాదేవి, వాసు, ప్రతిభ, భీమ్ రాజ్, పంకజ్, దీపక్, తిలక్, జి. మహేష్, వెంకటేష్, ఆర్.సంతోష్, రవి యాదవ్, పంచు, సూరి సత్యనారాయణ, అజయ్, భాస్కర్, గణేష్, మిలింద్, ఎస్.ఎస్ రామ, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట