ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ పరిధిలో మల్లాపూర్ డివిజన్ ఎన్ ఎఫ్ సి ఎక్స్ రోడ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డిల తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లాపూర్ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని , అదేవిధంగా ప్రెసిడెంట్లు జరుగుతున్నాయని తెలిపారు. వాహనాల రద్దీ వలన కాలినడక బాటసారులకు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయన్నారు. ఇట్టి ప్రమాదాలు నివారణ కొరకు, ప్రజా అవసరాల కొరకు తక్షణమే ఎన్ ఎఫ్ సి ఎక్స్ రోడ్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు.