రెండేళ్ల నుంచి పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. పీఆర్సీ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 లేదా 15 రోజుల్లోగా నివేదికను ఇవ్వాలని గత నవంబర్ లో ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఆ గడువు తేదీ దాటినా నివేదిక తెప్పించలేకపోయింది.
పైగా ఇప్పుడు పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) గడువును పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయినా కొత్త పీఆర్సీ అమల్లోకి వస్తుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు దీనితో నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో కనీసం మధ్యంతర భృతి అయినా ప్రకటించాలని వారు కోరుతున్నారు.