డివిజన్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సప్లై సమస్యల పరిష్కరించాలని హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ జలమండలి జనరల్ మేనేజర్ జానిషరీష్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా రాంరెండ్డి నగర్, కామాక్షిపురం, గణేష్ నగర్, శ్రీనివాసపురం, వెంకట్ రెడ్డి నగర్ కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ చాలా సంవత్సరాల క్రితం వెసారని ప్రస్తుతం ప్రజలకు అది సరిపోవడం లేదని అవసరమైన చోట కొత్త లైన్ వేయాలని కోరారు. అదేవిధంగా చేతి పంపులు చాలా చోట్ల పనిచేయడం లేదని వాటిని రిపేరు చేయాలని కొన్ని చోట్ల పవర్ బోర్లకు మోటార్లు బిగించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పటేల్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి