నిబంధనలు పాటించని బ్యాంకలు, ఇతర సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరఢా ఝులిపిస్తోంది. తాజాగా రెండు సంస్థలపై జరిమానా విధించింది. పేమెంట్ ఆపరేటర్లైన మొబిక్విక్, స్పైస్ మనీపై పెనాల్టీ విధిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ రెండు పేమెంట్ ఆపరేర్లు ఆర్బీఐ ఇచ్చిన నిబంధనలు పాటించనందున ఒక్కో సంస్థకు కోటి రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేశామని ఆర్బీఐ తెలిపింది. సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007లోని సెక్షన్ 26(6) ఆధారంగా నిబంధనలు పాటించనందున పేమెంట్ ఆపరేటర్లకు ఈ పెనాల్టీ విధించింది.