బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ఆయన నేడు కన్నుమూశారు. ఆయన ముంబయిలోని హెచ్ఎన్రిలయన్స్ ఆస్పత్రిలో అస్వస్థతతో చేరారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న రిషి కపూర్ కు తాజాగా శ్వాసకోస సంబంధిత సమస్య తలెత్తింది. ఈ కారణంగానే ఆయన తుది శ్వాస తీసుకున్నట్లు ఆయన సోదరుడు రణ్ధీర్కపూర్ తెలిపారు.
గతేడాది సెప్టెంబరులోనే క్యాన్స్ర్కు చికిత్స తీసుకున్న రిషీ కపూర్ అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్వంటి సమస్యలతో ఫిబ్రవరిలో రెండు సార్లు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఎప్పుడు సోషల్మీడియాలో చురుగ్గా ఉండే రిషి కపూర్.. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఆయన ట్విటర్ ఖాతాలో ఎటువంటి పోస్ట్ చేయలేదు.