పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి 67 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిష్కరించవలసినదిగా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగినదని తెలిపారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి,నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందుమాధవ్, డిఎస్పీలు విజయ భాస్కర్ రెడ్డి, కమలాకర్, రవిచంద్ర, జయరాం ప్రసాద్, సీఐ సుభాషిణి, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
previous post