అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి నేడు ” స్పందన ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 79 పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ప్రజలు తమ బాధలు, సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకుని పిటీషన్లు అందజేశారు. ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు.
కుటుంబ కలహాలు, ఫోర్జరీలు, అత్తారింటి వేధింపులు, చిన్న చిన్న వివాదాలు, తదితర సమస్యలను విన్నవించారు. చట్టపరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అనంతపురం