ఆన్ లైన్ న్యూస్ నెట్ వర్క్ లో తన శైలిలో సత్యం న్యూస్.నెట్ దూసుకెళుతోందనటానికి మరో నిదర్శనం విజయనగరంలో ఉన్న ఎన్నో ఏళ్ల నాటి వ్యాసనారాయణ మెట్టే. ఇటీవలే వ్యాసనారాయణమెట్టలో అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నాయని రాయడం…అందుకు ఓ స్పార్క్ స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి వ్యాసనారాయణ మెట్టను అభివృద్ది చేయడం అన్నీ తెలిసినవే. తాజాగా ఆ మెట్టలోనే కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్విహిస్తోంది…స్పార్క్ సొసైటీ.
ఈ మేరకు తన 15 వార్షికోత్సవాన్నిఅత్యంతవైభవంగా నిర్విహించుకునేందుకు ఆ సొసైటీ ప్రణాళిక సిద్దం చేస్తోంది.అలాగే తన సంస్థ 15వ వార్షికోత్సవం తోపాటు విజయనగర విశేషాలు ఫేస్ బుక్ గ్రూప్ 6వ వార్షికోత్సవం సందర్భంగా పూల్ బాగ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వ్యాస నారాయణ మెట్ట,లో ఈ నెల 28వ తేదీన సామూహిక సత్యనారాయణ స్వామి, త్రినాథ వ్రతాలు, లక్ష దీపోత్సవం నిర్వహిస్తోంది.
అలాగే అందుకు కావలసిన పూజ సామాగ్రి, 365 నెయ్యి వత్తులు, ప్రమిదలను స్పార్క్ సొసైటీ నే ఉఉచితముగా అందిస్తోంది. అక్కడే కార్తీక మాస వనభోజనం కూడా స్పార్క్ సొసైటీ ఏర్పాటు చేస్తోందని నిర్వాహకులు పద్మనాభం తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహిస్తున్న పూజాది సాంస్ర్కతిక కార్యక్రమాలతో పాటు మెట్ట వద్దే మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేసామని నిర్వాహకులు తెలిపారు.
ప్రతీ ఒక్కరూ ఈ సామూహిక కార్యక్రమాలు హాజరుకావాలని అందుకు ఎటువంటి రుసుము(ఫీజు) ఉందని తెలిపారు. అలాగే వినోద కార్యక్రమాలైన గోరింట(మెహెంది) కౌంటర్, బెలూన్ షూటింగ్,గుర్రపు స్వారీ, సంప్రదాయ నృత్యాలు,ట్రాక్ ఆర్కెస్ట్రా, ఫ్యాన్సీ డ్రెస్, హౌసి వంటి కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం