37.2 C
Hyderabad
March 29, 2024 20: 17 PM
Slider జాతీయం

జామా మసీదులో మహిళల ప్రవేశానికి ఓకే

#jamamasjid

మసీదు పవిత్రతను కాపాడాలనే షరతుతో బాలికల ప్రవేశాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకునేందుకు జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ అంగీకరించారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే ఎవరికైనా ఈ ఉత్తర్వులు వర్తించవని ఆయన గురువారం తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీని గురించి ప్రస్తావిస్తూ ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని షాహీ ఇమామ్‌ను అభ్యర్థించారు.

దాంతో అహ్మద్ బుఖారీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జామా మసీదు ప్రధాన ద్వారం వద్ద మసీదులోకి బాలికల ప్రవేశాన్ని నిషేధిస్తూ నోటీసులు అతికించారు. ఈ నిర్ణయం జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా  విచారణకు తీసుకుంటామని హెచ్చరించింది. మహిళా హక్కుల సంఘాల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. మసీదు అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన నోటీసులో, జామా మసీదులో ఒంటరిగా లేదా సమూహంగా ఏ అమ్మాయి ప్రవేశించడం నిషేధించబడింది.

షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ప్రకారం, ప్రాంగణంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జామా మసీదు 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ స్మారక చిహ్నం. ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇది ప్రార్థనా స్థలం. ఇక్కడికి ఆడపిల్లలకు ప్రవేశం లేదు.

మసీదు నిబంధనలను ఎవరూ ఉల్లంఘించరాదని బుఖారీ తెలిపారు. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ ఇది సిగ్గుమాలిన, రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడం పూర్తిగా తప్పు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పురుషులకు మాత్రమే ప్రార్థన చేసే హక్కు ఉంటుందా? స్త్రీలకు ఉండదా అని ప్రశ్నించారు.

Related posts

శివరాత్రి నాడే శని త్రయోదశి: వివిధ రాసుల వారిపై ప్రభావం ఏమిటి?

Satyam NEWS

వాష్ అవుట్: కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్

Satyam NEWS

అన్యాక్రాంతమైతున్న ప్రభుత్వ భూములు

Satyam NEWS

Leave a Comment