కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం లో భక్తుల భక్తుల దర్శనాల పై ఆంక్షలు విధించారు.
రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు భక్తులకు ప్రతి రోజు ఉదయం 07 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.
అదే విధంగా గర్భాలయ దర్శనానికి అనుమతి లేదు. అభిషేకాలు, కాలసర్ప పూజలు, నవగ్రహ పూజలకు, ఇతర పూజలను నిర్వహించడం లేదు.
ఆలయంలో అర్చక సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, కాళేశ్వరం గ్రామంలో కూడా కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాళేశ్వరం గ్రామంలో నిన్న ఒకరు కోవిడ్తో మరణించారు.