విద్యార్ధులకు సాయం చేయడం కన్నా గొప్ప విషయం మరొకటి లేదని నమ్మిన రిటైర్డ్ ఎంపిడివో పి. కృష్ణయ్య గౌడ్ తన వంతు సాయం చేశారు. సింగోటంలోని జెడ్ పి హెచ్ పాఠశాల విద్యార్ధులకు ఆయన నేడు డిక్షనరీలను అందచేశారు. చిన్నంబావి మండలంలోని పెద్దమూరూరు గ్రామంలో స్థిర నివాసం ఉంటున్న రిటైర్డ్ ఎంపిడివో పాఠశాల విద్యార్ధులందరికి ఈ సహాయం చేశారు.
ఆయన చేసిన సాయానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి అభినందనలు వ్యక్తం చేశారు. ఎస్ఎంసి చైర్మన్ సూర్య నారాయణ, ఉపాధ్యాయులు వరదాచారి, వేణుమాధవగౌడ్, జ్యోత్స్నారాణి, తిమ్మారెడ్డి, కృష్ణయ్య, సరోజ, విజయలక్ష్మి తమ విద్యార్ధులకు సాయం చేసిన కృష్ణయ్య గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.