అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను తిరిగి దేవాదాయ శాఖ జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. దేవాదాయ శాఖ ఉండేది హిందూ ఆలయాల పరిరక్షణ కోసమేనని దానికి సంబంధించిన నిధులను వేరే పథకాలకు ఎలా వాడతారని లేఖలో ప్రశ్నించారు.
మళ్లించిన నిధులను మళ్లీ దేవాదాయ శాఖకు జమ చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. అమ్మఒడి పథకానికి మళ్లించిన 24 కోట్లు 25 లక్షల 75వేల రూపాయలు తక్షణమే దేవాదాయశాఖకు చెల్లించాలని డిమాండ్ చేశారు.