27.7 C
Hyderabad
April 24, 2024 10: 42 AM
Slider గుంటూరు

దేవుడి సొమ్ములు అమ్మఒడికి మళ్లిస్తారా?

#Kanna Laxminarayana

అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను తిరిగి దేవాదాయ శాఖ జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన  సీఎం జగన్​ మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. దేవాదాయ శాఖ ఉండేది హిందూ ఆలయాల పరిరక్షణ కోసమేనని దానికి సంబంధించిన నిధులను వేరే పథకాలకు ఎలా వాడతారని లేఖలో ప్రశ్నించారు.

మళ్లించిన నిధులను మళ్లీ దేవాదాయ శాఖకు జమ చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. అమ్మఒడి పథకానికి మళ్లించిన 24 కోట్లు 25 లక్షల 75వేల రూపాయలు తక్షణమే దేవాదాయశాఖకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Related posts

తెలంగాణ మద్యం దుకాణాలకు ఆంధ్రా కిక్కు

Satyam NEWS

కేసీఆర్ బొమ్మలే కాదు బూతు బొమ్మలు కూడా

Satyam NEWS

వినాయక్ సీనయ్య ఫస్ట్ లుక్ విడుదల

Satyam NEWS

Leave a Comment