తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయకపోతే బతకడం కష్టమని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
అధినాయకుడు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని తక్షణమే పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు.
టీడీపీ కి ఉన్న కార్యకర్తలు దేశంలో ఏ పార్టీ కి లేరని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యవంతులు అని అయితే వాళ్ళల్లో ధైర్యం నింపే నాయకులే భయపడుతున్నారని తెలిపారు.
దీనిపై మరో వేదికలో స్పష్టంగా మాట్లాడతా అని మీడియాకు తెలిపారు.