కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు ఏ రేవంత్ రెడ్డి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.
తన ఎంపీ నిధులు కోటి రూపాయలతో పాటు పలువురి వద్ద విరాళాలు చేపట్టి బొల్లారంలో ఆయన అన్ని సౌకర్యాలతో 50 పడకల కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.
ఇలాంటి అపత్కాలంలో చొరవ తీసుకున్న రేవంత్ రెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపి మల్లు రవి అభినందించారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కరోనా పేషంట్ల కోసం తన స్వంత నిధులతో మూడు అంబులెన్సులు ఏర్పాటు చేశారు.
వీటిని ఆయన గాంధీభవన్ లో అందచేశారు.
జగ్గారెడ్డి తీసుకున్న చొరవ అభినందనీయమని, ఇలాంటి చర్యలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని మల్లు రవి అన్నారు.