తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన ఎనుముల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకారోత్సవానికి వేలాదిగా తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి పిలుపునిచ్చారు.
ఈ నెల 7న హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పదవీ బాధ్యతల స్వీకారోత్సవం జరుగుతున్నది.
జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు ములుగు నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జెడ్పీటీసీ లు,ఎంపీపీ లు,సహకార సంఘాల ఛైర్మన్ ల,సర్పంచ్ లు ఎంపీటీసీ లు మహిళ నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, సీతక్క అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.