శ్రీశైలం జల విద్యుత్కేంద్రం ప్రమాదం పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు ఏ.రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. సీబీఐ తో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA )తో శాఖాపరమైన విచారణకు అదేశించాలని ఆయన కోరారు.
9 మంది చనిపోయిన ఈ సంఘటనలో క్రిమినల్ కోణం ఉందని ఆయన ఆరోపించారు. ఈ ప్రమాదంలో వందల కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ప్రమాదం జరగడం వల్ల కొందరికి లాభం జరిగిందని ఆయన అన్నారు.
సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అనుభవం లేని రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావు ను ఎండీ గా ఉండడం వల్ల జెన్కో, ట్రాన్స్కో సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని ఆయన అన్నారు.