కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపి రేవంత్ రెడ్డి 52 వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కె. విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కాట్ చేసిన అనంతరం బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రి లో రోగులకు పండ్లను పంపిణి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లోవుంటూ కె సి ఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న విధానం పై ఎప్పటికప్పుడు ఎండగడుతూ తెలంగాణ ప్రజలకు అండగ ఉంటున్న నిక్కచ్చయిన నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దళిత బందు, రైతు భీమా, కె సి ఆర్ కిట్టు, తదితర పథకాల పేరిట పూర్తిగా మోసం చేస్తూన్నాడని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మర్చి ప్రజలకు పూర్తిగా మోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. కార్యక్రమం లో మాజీ ఎఫ్ ఏ సి ఎస్ చైర్మన్, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్పాల్ గంగాధర్, కాంగ్రెస్ నాయకులు సాయిని అశోక్, దర్పల్ శేఖర్, యువరాజ్, కాళోజి, మునీర్,ఎం డి. అబ్బు, గంగసాగర్,జాదవ్ సుచిత్ కుమార్, బాలకృష్ణ పుల్కల్ సొసైటీ డైరక్టర్ చైతు, శరత్, హరికృష్ణ,తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జీ. లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం