కడప జిల్లా పెద్దముడియo మండలంలోని గుండ్లకుంట గ్రామ రెవిన్యూ అధికారి వెంకటశివ ఆత్మహత్యా యత్నం చేశారు. అత్యవసర చికిత్స కోసం కర్నూల్ తీసుకెళ్లడం జరిగినదని బంధువులు పేర్కొన్నారు. ఈ సంఘటన గల కారణం తాసిల్దార్ ఒత్తిడి అని తెలిసింది. ఈ మేరకు ఆయన ఒక లెటర్ రాసినట్లు బంధువులు పేర్కొన్నారు.
ఈ సంఘటనపై జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షులు యాదాటి రామ గంగాధర్ రెడ్డి యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం దేవానందకుమార్ లు ఈ సంఘటనపై వాస్తవాలను ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.
సూసైడ్ నోట్ రాసుకున్న విషయాలు వాస్తవ లేక ఆవాస్తమా లేక ఏవైనా ఇంకా కారణాలు ఉన్నాయా అనే విషయాల పైన కూడా సమగ్రంగా తెలుసుకొని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు.