పేద రైతులను అడ్డుకోవడం పెద్ద రైతుల వైపు చూడటం రెవెన్యూ శాఖకు అలవాటైపోయింది. కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అయితే మరీ విచిత్రాలు జరుగుతున్నాయి.
కౌటాల మండలం లో ఇలా ఒకటి కాదు రెండు కాదు వందలాది భూ సమస్యలు పేరుకుపోయాయి. కోర్టు నుండి కలెక్టర్ నుండి ఆర్డర్స్ వచ్చినా తాసిల్దార్ ఆఫీస్ లో మాత్రం వాటిని పక్కన పెట్టి డబ్బులు దండుకునే ప్రయత్నాలే చేస్తున్నారు.
రైతులకు వారి పట్టాలు వారికి అందేలా చేయాలని లేనియెడల రైతులతో పెద్ద ఎత్తున తాసిల్దార్ కార్యాలయం ని ముట్టడిస్తామని సిర్పూర్ నియోజకవర్గ బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావి శ్రీనివాస్ హెచ్చరించారు.
ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం బాబూజీ బొరుకుట్ విటల్ కస్తూరి సత్యనారాయణ కసం గొట్టు సంతోష్ సురేష్ హనుమంతు సుధాకర్ సంజీవ్ దేవన్న కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.