సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేకంగా డిడిఓ లను నియమించినందుకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
కేంద్రమైన తుగ్గలి ఎమ్మార్వో ఆఫీస్ లో నేడు వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ms.02 ఇవ్వడంతో గ్రామ రెవెన్యూ అధికారులను ప్రభుత్వ పథకాలకు డి డి ఓ గా నియమించడమైనది.
ముఖ్యమంత్రి ఆశలకు అనుగుణంగా తాము అందరం కష్టపడి పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరేలా సమర్థంగా పని చేస్తామని గ్రామ రెవెన్యూ అధికారులు తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ పాల్గొన్నారు.