31.2 C
Hyderabad
February 14, 2025 21: 04 PM
Slider మహబూబ్ నగర్

అక్రమ వెంచర్ కారకులపై చర్యలు తీసుకోవాలి

mrps kollapur

కొల్లాపూర్ పట్టణ కేంద్రం లోని వరిదేల సమీపంలో  భూదాన్ స్థలంలో  అక్రమ వెంచర్ వేయడానికి సిద్ధమైన కారకులపై రెవెన్యూ శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్  జిల్లా అధ్యక్షుడు  కోళ్ల శివ డిమాండ్ చేశారు. శుక్రవారం  ఎమ్మార్పీఎస్ నాయకులు కోళ్ల శివ ఆధ్వర్యంలో ఆర్డీవోకు విన్నతి పత్రం అందచేశారు.

కొల్లాపూర్ పట్టణ ప్రాంతంలోని వరిదేల సర్వే నంబర్ 113లో 11.03 ఎకరాల భూదాన్ స్థలాన్ని వెంచర్ గా మార్చడానికి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధమయ్యారు. తాహసిల్దార్ కార్యాలయంలో కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారు. లోపాయకారిగా కొందరు అధికారులు అనుమతులు ఇస్తున్నారు.

తక్షణమే రెవెన్యూ శాఖ పరంగా ఈ అక్రమానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. లేనియెడల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అగ్ర స్వామి, పుట్టపోగ రాము, పరమేశ్వర్, రామకృష్ణ, సన్నయ్య, మధు  హెచ్చరించారు. దీనికి ముఖ్య కారకులు కారకులపై చర్యలు తీసుకొని భూదాన్ స్థలాని ఆధీనంలోకి తీసుకొని ముందు భౌవిష్యత్తులో ఏదైనా సోషల్ వెల్ఫేర్ లకు ఇవ్వడానికి ఉపోయోగపడుతుందని కోళ్ల శివ అంటున్నారు.

Related posts

ఫోర్బ్స్‌అత్యంత శక్తివంతమైన మహిళగా నిర్మలసీతారామన్‌

Sub Editor

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఉద్యమంలో విభేదాలు

Satyam NEWS

ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment