నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలపై రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వివిధ సంక్షేమ పథకాల ప్రగతిని ఆయన అడిగి తెలుసుకుని జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కుర్మానాద్, నెల్లూరు నగర కమిషనర్ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు