హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజనల్లో నెలకొన్న సమస్యలు , అభివృద్ది పనులపై మల్లాపూర్ డివిజన్ కార్పోరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం మల్లాపూర్ వార్డు ఆఫీసులో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా డివిజన్ పరిదిలో నెలకొన్న వివిద సమస్యల గురించి కాప్రా సర్కిల్ డిప్యూటీ కమీషనర్ శంకంర్, ఈఈ. కోటేశ్వరరావులతో చర్చించారు.
ముఖ్యంగా శానిటేషన్ సమస్య , నెహ్రూనగర్ కాలనీలో మంచినీటి సమస్య , మురుగు నీటీ సమస్య పరిష్కారానికి అభివృద్ది పనుల ప్రతిపాదనలు త్వరితగతిన తయారుచేయుట గురించి చర్చించారు. సమస్యలు పరిష్కరించడంలో వివిద శాఖల సమన్వయ లోపమేకారణమని ,ఆయా శాఖలను సమన్వయపరుచుకొని డివిజన్లోని సమస్యలను పరిష్కరించాలని కార్పోరేటర్ దేవేందర్రెడ్డి కోరారు. కార్యక్రమంలో డీఈ. రూప, వాటర్వర్క్సు డీజిఎం.కృష్ణ, శానిటేషన్ అధికారి నాగరాజు తదితరలు పాల్గొన్నారు.