30.7 C
Hyderabad
April 17, 2024 01: 28 AM
Slider రంగారెడ్డి

ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్భందికి రివార్డులు 

#cybarabad

సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని ఎస్‌ఓ‌టి శంషాబాద్, సి‌సి‌ఎస్ శంషాబాద్, మియాపూర్ మరియు  మేడ్చల్ పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బందిని ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్‌ఓ‌టి శంషాబాద్, సి‌సి‌ఎస్ శంషాబాద్  పరిధిలో జరిగినటు వంటి చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించినందుకు గాను ఎస్‌ఓ‌టి శంషాబాద్  సిబ్బంది ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఎస్‌ఐ రవి, 13 మంది కానిస్టేబుల్ లను మరియు ఎస్‌ఓ‌టి శంషాబాద్ సిబ్బంది ఏ‌డి‌సి‌పి నరసింహ రెడ్డి,  ఏ‌సి‌పి శశాంక్ రెడ్డి , ఇన్స్పెక్టర్ నరసింహ, ఎస్‌ఐ మాధవ రెడ్డి , 6 మంది కానిస్టేబుల్ లను క్యాష్ రివార్డు అందజేశారు. 

మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మయూర్ నగర్  మరియు నగర్ లో పరిధిలో జరిగినటువంటి స్నాచింగ్ లను  కేసును ఛేదించిన అందుకు గాను మియాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇన్స్పెక్టర్ తిరుపతి రావు , డి‌ఐ కంతా రెడ్డి, డి‌ఎస్‌ఐ జగదీశ్వర్, 8 మంది కానిస్టేబుల్ లను  క్యాష్ రివార్డు అందజేశారు. 

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం లో జరిగినటువంటి ఫోన్లు మరియు ల్యాప్ టాప్ చోరీని చేదించినదుకు గాను  మేడ్చల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇన్స్పెక్టర్ రాజశేకర్ రెడ్డి, ఏ‌ఎస్‌ఐ రామ్ చందర్, ఇద్దరు కానిస్టేబుల్ లకు  క్యాష్ రివార్డు అందజేశారు.  ఈ కార్యక్రమం లో  క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, బాలానగర్ డీసీపీ సందీప్, ఏడీసీపీ క్రైమ్స్ నరసింహ రెడ్డి, ఏసీపీ లు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు, ఎస్‌ఐ లు  మరియు ఇతర పోలీసు సిబ్బంది  ఉన్నారు.

Related posts

సీఎం జగన్ ఓ కలుపు మొక్క

Satyam NEWS

శ్రీనగర్‌లో భద్రతాబలగాలపై మళ్లీ ఉగ్రదాడి

Satyam NEWS

కరోనా కేసులను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకురావాలి

Satyam NEWS

Leave a Comment