రామ్ గోపాల్ వర్మ మళ్లీ బరితెగించాడు. ఈ సారి తనపైనే తాను సినిమా తీసుకున్నాడు. తాను ఒక అమాయకుడైన బాధితుడినని ప్రకటించుకున్నాడు.
ఈ సారి రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమా పేరు ‘‘ఆర్ జీ వీ మిస్సింగ్’’. టైటిల్ ఏదైనా పెట్టుకోనీ కానీ కింద ఉన్న ట్యాగ్ లైనే ఈ సారి మరింత కాంట్రవర్సీ కాబోతున్నది.
కాంట్రవర్సీనే రామ్ గోపాల్ వర్మకు పెట్టుబడి కాబట్టి మళ్లీ కాంట్రవర్సీనే ఉపయోగించాడు. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. రామ్ గోపాల్ వర్మ తప్పిపోతాడు.
అతడిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ ఎవరు అంటే పికె ఫ్యాన్స్ (పవన్ కళ్యాణ్ అభిమానులు) మెగా ఫ్యామిలీ (చిరంజీవి కుటుంబ సభ్యులు)
మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు( చంద్రబాబునాయుడు, లోకేష్) అనేది ట్యాగ్ లైన్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ.
ఇది ఫస్ట్ లుక్ పోస్టర్ కాగా ఇప్పుడు ఇంకో పోస్టర్ కూడా రామ్ గోపాల్ వర్మ విడుదల చేయబోతున్నాడు. అందులో మరింత క్లియర్ గా చెబుతాడేమో చూడాలి.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథను రామ్ గోపాల్ వర్మ కావాలనే లీక్ చేశాడు.
తన సినిమాకు చీప్ గా పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలిసిన రామ్ గోపాల్ వర్మ ఈ సారి చాలా మంది ప్రముఖులను కెలుకుతున్నాడు.