ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత 60 రోజులుగా 29 గ్రామాల రైతులు చేస్తున్న నిరసన దీక్షలకు మద్దతుగా అమరావతి పరిరక్షణ కమిటీ నరసరావుపేట జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు డాక్టర్ చదలవాడ అరవింద బాబు నేతృత్వంలో 51 క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందజేసేందుకు అమరావతి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు కలిసి అమరావతి బయలుదేరి వెళ్లారు.
51 క్వింటాళ్ల బియ్యం లోడు తో ఉన్న లారీని చదలవాడ అరవింద బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కడియాల రమేష్, వెన్న బాలకోటి రెడ్డి,గడ్డం పురుషోత్తమ రాజా, పులిమి రామిరెడ్డి, వల్లపు నాగేశ్వరరావు, బోడపాటి పేరయ్య, తన్నీరు పోతురాజు, వాసిరెడ్డి రవి, మీరావలి,యాడ్స్ వాలి, ముత్యాల శ్రీను, గొట్టిపాటి చౌదరి బాబు, కసింధుల శ్రీరాములు, కాసా రాంబాబు, మెహర్, గుర్రం సుబ్రహ్మణ్యం, కాసయ్య, శాఖమూరి రామ్మూర్తి పాల్గొన్నారు.
అంతే కాకుండా అబ్బూరి వెంకటేశ్వరరావు, కుమ్మేత కోటి రెడ్డి, వసంత ఎల్లమంద, మక్కెన ఆంజనేయులు, శంకర్ రావు,రాయప్ప, సుభాని,బాషా, దాసరి పుల్లయ్య, కోలా సంజీవ్ రావు,మోహన్ రావు, శేఖర్, ప్రసాద్, కనుమూరి లక్ష్మి, కుమారి, సింధు పద్మావతి, సుభాషిని, రొంపిచర్ల,నరసరావుపేట మండల నాయకులు, నరసరావుపేట పట్టణ ముస్లిం మైనారిటీ,ఎస్సీ,ఎస్టీ బీసీ, మైనార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.