Slider ప్రత్యేకం

తెలంగాణ నుంచి తొలిసారి ఫిలిప్ఫయన్స్ కు బియ్యం ఎగుమతి

#uttamkumarreddy

తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారి ఫిలిప్ఫయన్స్ కు బియ్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బియ్యం ఎగుమతి విధానం అన్న అంశంపై మంగళవారం ఒకరోజు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు.

ఆయన మాట్లాడుతూ దేశంలోనే వరి ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని అన్నారు. ప్రస్తుత 2025-26 సంవత్సరంలో రాష్ట్రంలో సుమారుగా 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని ఇది ఒక రికార్డు అని చెప్పారు. ఈ ఘనత కు రైతుల కృషి తో పాటు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ప్రకృతి సహకారం మరియు నూతన వరి రకాలు అందుబాటులో ఉండటం కారణం అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రైతాంగాన్ని అభినందించారు.

రైతాంగానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందనీ..సన్న రకాలకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ తో పాటు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజల స్థానిక అవసరాలకు పోను, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన బియ్యం పోను, కేంద్ర నిలువల కోసం సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు లు పోగా ఇంకా సుమారు 50 నుంచి 60 లక్షల మెట్రిక్  టన్నుల బియ్యం రాష్ట్రంలో మిగులు ఉంటుందని ఆయన అన్నారు.

మిగులు ధాన్యం మార్కెట్ చేయడానికి అన్వేషన్లో భాగంగా ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని ఫిలిప్పైన్స్ కు తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయడాన్ని సదావకాశంగా తీసుకొని ఆ ప్రభుత్వంతో నేరుగా అవగాహన ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

దొడ్డు రకాలలో ముఖ్యమైన MTU -1010, ఐ. ఆర్-64 రకాలను రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేస్తున్నారని..వీటికి  ఫిలిప్పీన్స్ లో అధిక డిమాండ్ ఉందని తెలిపారు. వరి సాగు లో ఇటీవల రైతాంగంలో ఆదరణ పొందుతున్న వరి నేరుగా  విత్తే పద్ధతి(DSR) రోజు విడిచి రోజు నీరు పెట్టే విధానం(AWD), తక్కువ రసాయనాలు కలిగిన వరి రకాలను ఉత్పత్తి చేయడంపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు.

ఎగుమతి అనుకూల రకం వంగడాలకు ప్రోత్సాహం

అదేవిధంగా ఎగుమతికి అనుకూలమైన వరి రకాలను ఉత్పత్తి చేయడానికి రైతులకు తగిన ప్రోత్సాహకాలు, ఎగుమతి దారులకు విధానపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. అధునాతన బియ్యం మిల్లులను ఒక డెమో రూపంలో ఆధునిక రైస్ మిల్లును వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసి రైతులకు, యువతకు శిక్షణ ఇచ్చి ఆధునిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య మాట్లాడుతూ ఫిలిప్పీన్స్ దేశం ఎప్పటికీ దిగుమతి చేసుకునే దేశమేనని.. ఎన్నటికీ స్వయం సమృద్ధి సాధించే దేశం కాదు కాబట్టి ఆ దేశాన్ని తెలంగాణ బియ్యానికి అనుకూలమైన మార్కెట్ గా గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లయితే తెలంగాణలో పండుతున్న బియ్యం నిల్వలకు శాశ్వత పరిష్కారం దొరికినట్లేనని చెప్పారు.

అంతేకాకుండా, ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి బియ్యం ఔత్సాహిక ఎగుమతి దారులకు సరఫరా చేసినట్లయితే ప్రభుత్వానికి అయ్యే ఖర్చుకు సమానంగా ఔత్సాహికదారులకు ఇచ్చినట్లయితే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండానే ఎగుమతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని మంత్రి సూచించారు.

అఖిలభారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బి కృష్ణారావు,  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, అపెడా అధికారులు, రైతు నాయకులు, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు, వరల్డ్ ఫుడ్ ప్రైజ్  ఫౌండేషన్ అవార్డు గ్రహీత మరియు ఇటీవల విశ్వవిద్యాలయం నియమించిన యు జి సి  ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డాక్టర్ సమరేండు మహంతి ఎగుమతుల విధానం అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు.

Related posts

తెలంగాణలో ఒక్క రోజులో తాగేసింది ఎంతో తెలుసా?

Satyam NEWS

వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Satyam NEWS

పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జగన్ ప్రభుత్వం

mamatha
error: Content is protected !!