కరోనా వైరస్(Covid-19) కరాళనృత్యం చేస్తూన్న నేపథ్యంలో చాలామంది ఉపాధిని కోల్పోయిన పరిస్థితుల్లో వారిలో కొందరినైనా ఆదుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం వీధిలో వున్న పేద బ్రాహ్మాణ కుటుంబాలకు సోమవారం బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. దండపాణి సంస్థల అధినేత కామరాజు శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం వీధిలో వున్న పేద బ్రాహ్మాణ కుటుంబాలకు ఈ బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. స్థానిక రామేశ్వరం లోని శ్రీ హనుమత్ లింగేశ్వరస్వామి దేవస్థానం ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులతో పాటూ దండపాణి సంస్థల తరపున రామకృష్ణారెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి, రంగనాథ్, పట్టణ నందమూరి యువ సేవా సమితి తరపున గోమేధికమ్ సుదర్శన్ , సిజె.వెంకటసుబ్బయ్య, సి.సిద్ధయ్య, టి.సుధాకర్ యాదవ్, సింహా చంద్రశేఖర్ యాదవ్ లు పాల్గొన్నారు.
previous post