సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్, రైస్ మిల్ డ్రైవర్ల కార్మిక సంఘాలు 5వ, దఫా జాయింట్ చర్చలు మరల వాయిదా పడ్డాయని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి తెలిపారు.
చర్చల అనంతరం స్థానిక CITU కార్యాలయం వద్ద కార్మికుల గేట్ మీటింగ్ లో శీతల రోషపతి, ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, టిఆర్ఎస్ కెవి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ మాట్లాడుతూ ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రైస్ మిల్ డ్రైవర్ వేతనంపై నెలకి 3000 రూపాయలు వేతనం పెంచాలని కోరారు. ఈ చర్చల్లో యాజమాన్యం 1750 రూపాయలు పెంచుటకు ముందుకు రాగా అనంతరం మూడు రోజుల్లో మళ్లీ చర్చలు జరుపుతామని వాయిదా వేశారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల యాజమాన్యం నుండి లక్ష్మీ నరసింహ రావు, గజ్జి ప్రభాకర్, కుక్కడపు రామ్మోహన్ రావు, గెల్లి అప్పారావు, ఐ ఎన్ టి యు సి నాయకులు సలిగంటి జానయ్య, పోతన బోయిన రామ్మూర్తి, వీరబాబు, ఉపేందర్, సి ఐ టి యు నాయకులు ఎలక సోమయ్య గౌడ్, గుండెబోయిన వెంకన్న, అంజి, వెంకన్న, కనకయ్య, ఎల్లప్ప, టి ఆర్ ఎస్ టి వి నాయకులు చింతకాయల మల్లయ్య, సైదులు, ఎర్రయ్య, శీను, తదితరులు పాల్గొన్నారు.