పిపిటి కిట్స్ కానీ, మాస్కులు కానీ ఇవ్వకుండా విధులు నిర్వర్తించాలని వత్తిడి తీసుకురావడంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఆందోళన జరుగుతున్నది. కోవిడ్ 19 కు సంబంధించిన ప్రత్యేక వార్డుతో పాటు ఇతర వార్డులలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి పిపిటి కిట్స్ కాని మాస్కులు కాని ఇవ్వడం లేదని డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆరోపిస్తున్నారు.
డైరెక్టర్ చాంబర్ ముందు నేడు డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వైద్యులు పట్ల చిన్న చూపు చూస్తున్న రిమ్స్ డైరెక్టర్ బాణోత్ బలరాం నాయక్ ను విధుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. రిమ్స్ డైరెక్టర్ బాణోత్ బలరాం నాయక్ ను పదవి నుంచి తొలగించే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు చెప్పారు.